ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన కోతులు ఆమె దాచుకున్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన..

Updated : 19 Aug 2020 16:32 IST

చెన్నై: ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన కోతులు ఆమె దాచుకున్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని తిరువైయ్యూరులో చోటుచేసుకుంది. భర్త చనిపోయిన సారతంబల్ (70) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే బయట దుస్తులు ఉతుక్కుంటుండగా ఆమె ఇంట్లోకి చొరబడిన ఓ కోతుల గుంపు ఇంట్లోని అరటిపండ్లు, బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి. ఆ బియ్యం సంచిలోనే తన బంగారు ఆభరణాలు, రూ.25 వేలను దాచుకుంది. వృద్ధురాలు కోతులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఆ డబ్బు తన వైద్య ఖర్చుల కోసం దాచుకున్నట్లు ఆమె‌ తెలిపింది. స్థానికులు ఆ కోతుల కోసం గాలించినా వాటి జాడ తెలియరాలేదు. ఆగ్రహించిన స్థానికులు ఆ కోతులను బంధించాలని, ఇకపై వాటిని గ్రామంలో కనిపించకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని