Telangana news : తెలంగాణలో కొత్తగా 2,421 కరోనా కేసులు!

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,417 నమూనాలను పరిశీలించగా.. 2,421 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు వైరస్‌

Published : 03 Feb 2022 20:26 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,417 నమూనాలను పరిశీలించగా.. 2,421 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 7,71,828కి పెరిగింది. మహమ్మారి కారణంగా తాజాగా ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 4,096కి పెరిగింది.  రాష్ట్రంలో ప్రస్తుతం 33,104 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రికవరీ రేటు 95.18గా ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 649 మందికి పాజిటివ్‌గా తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని