Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పుంజుకుంటున్న పర్యాటకం..
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో
ఈనాడు, హైదరాబాద్: కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో ఇళ్లకే పరిమితమైనవాళ్లు.. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో బయటకొస్తూ, ఆహ్లాదం వైపు అడుగులు వేస్తున్నారు. వర్షాలు బాగా కురవడంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చెరువులు, నదుల్లో జనం బోటు షికార్లతో సందడి చేస్తున్నారు. భయాన్ని వీడి హోటళ్లలో బస చేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ‘హరిత’ హోటళ్లతోపాటు బోటింగ్ ఆదాయం రెండు, మూడు నెలలుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్, మేలలో రెండోదశ కరోనా, జూన్లో లాక్డౌన్ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపాయి. మే 12 నుంచి జూన్ 19 వరకు పర్యాటక హోటళ్లను, బోటింగ్ను నిలిపివేశారు. జులై నుంచి జనం బయటకొస్తుండటంతో రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతోంది. జులై - సెప్టెంబరు వరకు 3 నెలలపాటు 20 శాతం రాయితీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా ‘హరిత’ హోటళ్లలో గదుల బుకింగ్ గణనీయంగా పెరిగేందుకు దోహదపడిందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
హుస్సేన్సాగర్ తర్వాత కోమటిచెరువే..
నాగార్జునసాగర్, హుస్సేన్సాగర్, సోమశిల, సింగూరు, పాకాల, కడెం, ఎల్ఎండీ కరీంనగర్, కిన్నెరసాని, దుర్గంచెరువు, కోమటిచెరువు, లక్నవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల బోటింగ్ సదుపాయం ఉంది. జూన్-ఆగస్టు 3 నెలల్లో 3,29,817 మంది బోటింగ్ చేశారు. అత్యధికంగా హుస్సేన్సాగర్లో 2,07,599 మంది కాగా, ఆ తర్వాత మంత్రి హరీశ్రావు ప్రత్యేకశ్రద్ధతో అభివృద్ధి చేసిన సిద్దిపేట కోమటిచెరువు 66,797 మందితో రెండోస్థానంలో ఉండటం విశేషం.
మంచిరోజులు వస్తున్నాయ్
తెలంగాణలో పర్యాటకానికి మంచిరోజులు వస్తున్నాయి. కొన్ని హోటళ్లలో అయితే కొవిడ్కు ముందుకంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రామప్ప ఆలయానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే వారి సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరగనుంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.-శ్రీనివాస్గుప్తా, ఛైర్మన్, పర్యాటక అభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM