TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు

తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు భద్రాచలం మన్యంలోని చర్ల అటవీ ప్రాంతంలో

Updated : 01 Aug 2021 10:57 IST

చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు భద్రాచలం మన్యంలోని చర్ల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు, ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మండలంలోని కీకారణ్యం ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. మృతిచెందిన మావోయిస్టు వద్ద 303 రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని