శ్రీశైలం నుంచి సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,60,936

Updated : 13 Oct 2020 22:10 IST

10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,60,936 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. వరద కొనసాగుతుండటంతో 10 గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 3,77,427 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగుల వరకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా  ప్రస్తుత నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ అదనంగా 26, 427 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని