ఈ చిలుక స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేస్తుంది!
మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు. కానీ, స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేసే చిలుక కూడా ఉంది అంటే నమ్మగలరా? వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా ఇది నిజం. మొబైల్ను ఉపయోగించడం, మనుషులను అనుకరించడం, మాట్లాడటం ఇలా....
బిహార్: మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు. కానీ, స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేసే చిలుక కూడా ఉంది అంటే నమ్మగలరా? వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా ఇది నిజం. మొబైల్ను ఉపయోగించడం, మనుషులను అనుకరించడం, మాట్లాడటం ఇలా తన చేష్టలతో అందరినీ ఔరా అనిపిస్తోంది ఆ సిత్తరాల చిలుక. వివరాల్లోకి వెళితే..
బిహార్లోని కటిహార్లో నివాసం ఉండే రాజీవ్ శర్మ కుటుంబం ఏడాది క్రితం చిలుకను తెచ్చుకుని పెంచుకుంటోంది. ఈ చిలుకకు డుగ్గూ అని పేరు కూడా పెట్టుకున్నారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన డుగ్గూ వారిని అనుకరించడం మొదలు పెట్టింది. అలా ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసి మొబైల్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లను తన ముక్కు సాయంతో ఎంచక్కా ఆపరేట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతే కాదండోయ్.. యూట్యూబ్లో వీడియోలను కూడా ఈ చిలుక వెతికి మరీ చూస్తోందంట. ఫోన్లో బొమ్మలు కనిపిస్తే చాలు చిలుక పలుకులు పలుకుతూ మురిసిపోతోంది. తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డుగ్గూను రాజీవ్ శర్మ కుటుంబం పంజరంలో పెట్టకుండా తమ ఇంట్లో మనిషిగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినప్పుడు ఈ చిలుక వారితో పాటే ద్విచక్ర వాహనంపై షికారుకు కూడా వెళ్తోంది. వారి భుజాలపై కూర్చుని ఎంచక్కా సవారీ చేస్తుంది. ఆ సిత్తరాల చిలుక పలుకులు, చేష్టలు మీరూ చూసేయండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!