అర్ధరాత్రి ఎలుగుబంట్ల తనిఖీ.. ఎక్కడో తెలుసా..!
లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరిగేవి. తాజాగా.. ఛత్తీస్గఢ్లోని కాంకర్ ప్రాంతంలో గల ఓ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మూడు ఎలుగుబంట్లు ఎలాంటి అదురుబెదురు
రాయ్పూర్: లాక్డౌన్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరిగేవి. తాజాగా.. చత్తీస్గఢ్లోని కాంకర్ ప్రాంతంలో గల ఓ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మూడు ఎలుగుబంట్లు ఎలాంటి అదురుబెదురు లేకుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్లాయి. ఈ వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిని అక్కడి ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్లో పోస్టు చేశారు. పైగా, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఎలుగుబంట్ల ఆకస్మిక తనిఖీ అని ఆయన చమత్కరించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను ఆయన ప్రశంసించారు.
ఇది సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన క్షణాల్లోనే వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. చాలా అందమైన వీడియోను పోస్టు చేసిన ఐపీఎస్ అధికారికి ధన్యవాదాలు అంటూ కొందరు.. తనిఖీ ఆశాజనకంగా జరిగిందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఈ సంవత్సరం ప్రారంభంలో చత్తీస్గఢ్లోని ఓ ఆలయ సమీపంలో ఎలుగుబంట్లు సంచరించిన మరో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
నీటికొచ్చిన చిరుత.. వేటాడిన మొసలి
తాబేళ్ల సునామి ఎప్పుడైనా చూశారా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.