తిరుమలలో వైభవంగా హంసవాహన సేవ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవను శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో అర్చకులు....

Updated : 20 Sep 2020 20:59 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవను శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో అర్చకులు కొలువుదీర్చారు. సర్వతీమూర్తి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై శ్రీనివాసుడి దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. ఈ ఉదయం స్వామివారికి చిన్నశేష వాహనసేవ జరిగింది. మురళీకృష్ణుడి అలంకారంలో స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుదీరారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని