IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అధ్వర్యంలో వెటర్నరి కాలేజి గ్రౌండ్లో వీఐపీ, వీవీఐపీల వాహనశ్రేణుల శిక్షణా కార్యక్రమం జరిగింది.ఎన్ఎస్జీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ అధికారులు డీఎస్పీ డి కోటేశ్వరరావు,
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అధ్వర్యంలో వెటర్నరి కాలేజీ గ్రౌండ్లో వీఐపీ, వీవీఐపీల వాహనశ్రేణుల శిక్షణా కార్యక్రమం జరిగింది. వాహనాలను నడిపే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు డ్రైవర్లకు వివరించారు. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఏఆర్ డీఎస్పీ నంద కిషోర్, హోంగార్డ్ డీఎస్పీ లక్ష్మణ్ కుమార్, ఎంటీవో ఆర్ఐ రెడ్డప్ప రెడ్డి, డీఎస్పీ డి. కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ రాజు, ఎస్సై జానకిరాం, ఎన్ఎస్జీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ అధికారులు పాల్గొన్నారు.
కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్చాందీ, పాల్గొన్నారు. బళ్లారి హైవే నుంచి కలెక్టరేట్ వరకూ ఈ ర్యాలీ సాగింది.
రాష్ట్ర అటవీ అమరుల దినోత్సవాన్ని గుంటూరులోని అరణ్యభవన్లో ఘనంగా నిర్వహించారు. విలువైన వృక్షసంపదను కాపాడుతూ అసువులు బాసిన అటవీ ఉద్యోగులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్కుమార్లు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక ప్రతిభావంతులకు సదరం పరీక్షలు నిర్వహించారు. అర్హులైన వారికి వైద్యులు ధ్రువపత్రాలు జారీ చేశారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కలెక్టర్ మురళీధర్రెడ్డి పంట నష్టం తీరును కేంద్ర బృందానికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. -
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు