బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన హిజ్రాలు
తరచూ వేధింపులకు గురిచేసే వ్యక్తికి శిక్ష పడేలా చేశారంటూ హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీసులను హిజ్రాలు సత్కరించారు. కుర్మ వెంకట్ అనే వ్యక్తికి కోర్టులో శిక్ష పడేలా చేసినందుకు పోలీసులకు ..
బంజారాహిల్స్: తరచూ వేధింపులకు గురిచేసే వ్యక్తికి శిక్ష పడేలా చేశారంటూ హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీసులను హిజ్రాలు సత్కరించారు. కుర్మ వెంకట్ అనే వ్యక్తికి కోర్టులో శిక్ష పడేలా చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో బంజరాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో కుర్మ వెంకట్ అతని ముఠా హిజ్రాలను వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం న్యాయస్థానం కుర్మ వెంకట్కు శిక్ష విధించింది. ఈ సందర్భంగా హిజ్రాలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఏసీపీ, సీఐలను సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?