ఆ ఖజానా ఎవరిది?
బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో భారీగా బంగారు, వెండి నగలు వెలుగుచూశాయి. ఎనిమిది పెట్టెల్లో నిల్వ ఉంచిన ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వీటితోపాటు ఓ తుపాకీని స్వాధీనం
● భారీగా బంగారం, వెండి స్వాధీనం
అనంత నేరవార్తలు: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో భారీగా బంగారు, వెండి నగలు వెలుగుచూసిన ఘటన కలకలం రేపింది. ఎనిమిది పెట్టెల్లో నిల్వ ఉంచిన ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో ఒక్కసారి బయటపడటంతో జిల్లాలో కలకలం రేగింది. ఆ సొమ్ము ఎవరిది? ఎక్కడ్నుంచి తెచ్చారు అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇనుప పెట్టెల్లో భద్రపరచి చిన్న షెడ్డులో ఎందుకు ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖజానా ఎవరిది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎనిమిది పెట్టెలు తెరిచి చూడగా.. 2.4కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55లక్షల నగదు, 27లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49లక్షల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు గుర్తించారు. 6 బైక్లు, 3 రాయల్ ఇన్ఫీల్డ్ బుల్లెట్లు, అత్యంత ఖరీదైన మరో ద్విచక్రవాహనం, ట్రాక్టర్లు, 2 అత్యాధునిక కార్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మూడు 9ఎంఎం తుపాకులు, ఒక ఎయిర్గన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్కి చెందినవిగా అనుమానిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఆ ఉద్యోగి బంధువుల పేర్ల మీద ఉన్నట్లు సమాచారం.
ఖజానా శాఖలో ఆయన మాటే వేదం
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఆ ఉద్యోగి సుమారు 15 ఏళ్ల కిందట ఖజానా శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఆ శాఖలో ఎవరికి ఏ సెక్షన్లో పని ఉన్నా ఆ ఉద్యోగినే సంప్రదిస్తారు. ఆయన సొమ్ము ఇవ్వనిదే ఏ పనీ చేయడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన మాట నెగ్గాల్సిందే. లేదంటే బెదిరింపులకు వెనుకాడడు. రూ.లక్షలు ఇచ్చినా.. ఇంకా పని చేయకుండా కాలయాపన చేస్తున్నారని కొందరు బాధితులు వాపోయారు. పలు మార్గాల్లో అక్రమంగా సంపాదించాడు. విలాసవంతంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నాలుగు కార్లు, నాలుగు బుల్లెట్ వాహనాలు, రెండు గుర్రాలు ఉన్నాయంటే.. ఆయన సంపాదన ఏమిటో అర్థమవుతోంది. ఇటీవల రూ.15 లక్షలు ఖరీదైన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఇంకా అనేక ఆస్తులు బినామీల పేర్లతో ఉన్నాయి. అశోక్నగర్లో సెంట్రల్ ఏసీతో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. బుక్కరాయసముద్రానికి వెళ్లే దారిలో చెరువుకట్ట వద్ద మరో నివాసం ఉన్నట్లు సమాచారం. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కార్యాలయానికి విధులకు వస్తుంటాడు. ఆయన వెంట నిత్యం నలుగురు యువకులు అంగరక్షకుల్లా ఉంటారు. వారికి మంచి వేతనంతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం సమకూరుస్తున్నాడు. మొత్తంగా 10 మంది యువకులకు వేతనాలు చెల్లిస్తూ.. వివిధ పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది.
రియల్ దందా చేశాడా?
ఖజానా ఉద్యోగి తన వద్ద ఎయిర్ పిస్టల్ను ఉంచుకోవడంతో రియల్ దందాలు చేశాడా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పిస్టల్ పట్టుకుని తగాదా ఉన్న భూములు కొనుగోలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆయన పేరుతో నగరంలో చాలాచోట్ల ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అక్రమార్జనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. మరోవైపు రాజకీయ అండ కూడా ఉన్నట్లు సమాచారం. అధికారులపై ఒత్తిళ్లు చేయించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తుపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?