శునకంపై దాడి.. మండిపడుతున్న నెటిజన్లు
పెంపుడు శునకంపై దాడి చేసిన ఓ ఐటీ ఉద్యోగిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు....
‘జస్టిస్ ఫర్ బడ్డీ’ పేరుతో ట్రెండ్ అవుతున్న పోస్టులు
నొయిడా: పెంపుడు శునకంపై దాడి చేసిన ఓ ఐటీ ఉద్యోగిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నొయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి రిషబ్ మెహ్రా తన పెంపుడు శునకం (బడ్డీ)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బడ్డీకి గాయాలయ్యాయి. కాలి ఎముక, కొన్ని దంతాలు విరిగిపోయాయి. శునకం అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ దాడిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శునకానికి న్యాయం జరగాలని, యజమానిని శిక్షించాలని కోరుతున్నారు. ఘటనపై భాజపా నేత, పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) వ్యవస్థాపకురాలు మనేకా గాంధీ స్పందించారు. మెహ్రాపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అయితే ఇప్పటిక వరకు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడిని శిక్షించాలని, ‘జస్టిస్ ఫర్ బడ్డీ’ అనే హాష్ట్యాగ్తో ట్విటర్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఉద్యోగానికి అర్హుడు కాదని, సంస్థ యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి వెంటనే తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు. పోలీసులు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెహ్రాను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని మనేకా గాంధీ ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సినీనటి రిచా చద్దా సైతం స్పందించారు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని కోరారు. అలాంటి వ్యక్తి మీ సంస్థకు అవసరమా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి...
పెళ్లిపీటలు ఎక్కకుండానే ప్రాణాలు పోయాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి