మొసలిని విడిచిపెట్టాలా..రూ.50 వేలు ఇవ్వండి

తాము బంధించిన ఓ మొసలిని అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్ గ్రామస్థులు..

Published : 13 Sep 2020 01:26 IST

అటవీశాఖ అధికారులను డిమాండ్‌ చేసిన గ్రామస్థులు

పట్నా: తాము బంధించిన ఓ మొసలిని అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్ గ్రామస్థులు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. ఈమధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాలకు ఎక్కడినుంచో వచ్చిన 8 అడుగుల ఓ మొసలి లఖింపుర్‌ ఖేరీ జిల్లా మిదానియా గ్రామంలోని ఓ కొలనులో ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు దాన్ని కష్టపడి బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఇక్కడే ఓ తిరకాసు పెట్టారు. ప్రాణాలకు తెగించి మొసలిని కాపాడామని, దాన్ని వారికి అప్పగించాలంటే రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక పోలీసుల సాయంతో గ్రామస్థులను ఎలాగోలా ఒప్పించిన అటవీశాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని సమీప ఘాగ్ర నదిలో విడిచిపెట్టారు. ఈసందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే గ్రామస్థులు ఇలా చేశారన్నారు. వన్యప్రాణుల చట్టం గురించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని