పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో....
కేంద్రానికి తెలిపిన తెలంగాణ సీఎస్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమీక్షలో మొత్తం 12 రాష్ట్రాలకు చెందిన సీఎస్లు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అభినందించారు. కొవిడ్ మరణాలు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయన్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయడంపై అభినందనలు తెలిపారు. బస్తీ దావాఖానాల్లోనూ కొవిడ్ పరీక్షలు చేయడంపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. లక్షణాలు ఉండి యాంటీజెన్లో నెగెటివ్గా వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లాల్లో వ్యాపిస్తున్న కొవిడ్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు సీఎస్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు