అఫ్గాన్ వదిలి వచ్చేయండి.. టికెట్లకు రుణం ఇస్తాం..
తాలిబాన్ల హింస పెచ్చుమీరుతున్ననేపథ్యంలో వెంటనే అఫ్గానిస్థాన్ వదిలి, స్వదేశానికి చేరుకోవాలని తమ పౌరులకు అమెరికా విజ్ఞప్తి చేసింది. కాబూల్లోని యూఎస్ రాయబార కార్యాలయం శనివారం ఈ మేరకు ప్రకటన
ఇంటర్నెట్ డెస్క్: తాలిబాన్ల హింస పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వెంటనే అఫ్గానిస్థాన్ వదిలి, స్వదేశానికి చేరుకోవాలని తమ పౌరులకు అమెరికా విజ్ఞప్తి చేసింది. కాబూల్లోని యూఎస్ రాయబార కార్యాలయం శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విమాన టికెట్లు కొనేందుకు డబ్బులు లేనివారికి రుణాన్ని అందిస్తామని తెలిపింది. స్థానికంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఇక్కడుంటున్న అమెరికన్లకు కార్యాలయం తరఫున సాయమందించే అవకాశాలు సన్నగిల్లాయని, బెదిరింపులు, హింస కారణంగా.. ఇక్కడ సిబ్బందినీ తగ్గించినట్లు వెల్లడించింది.
ఇప్పటికే కాబూల్ వెలుపల దేశీయ విమాన సర్వీసులు, రోడ్డు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయి.. త్వరలో ఇవీ రద్దయ్యే ప్రమాదం ఉందని యూఎస్ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భద్రతా దళాలు అఫ్గాన్ను విడిచి వెళ్తున్న దరిమిలా.. స్థానికంగా దేశ సైన్యానికి, తాలిబాన్లకు మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారాలపై వైట్హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ.. తమ దేశం తాలిబాన్ల దురాగతాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అయితే, అమెరికా తన దళాల ఉపసంహరణను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM