పీవీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: ఉత్తమ్‌

రాష్ట్రానికి, దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ కొనియాడింది.

Published : 24 Jul 2020 16:11 IST

హైదరాబాద్‌: రాష్ట్రానికి, దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ కొనియాడింది. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీవీపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులు పీవీ సేవలను కొనియాడుతూ.. వీడియో ద్వారా సందేశమిచ్చారు. పీవీ ఎన్నటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ పీవీ నాకు వ్యక్తిగతంగానూ పరిచయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  భూ సంస్కరణలు తీసుకొచ్చి, లక్షల మందికి న్యాయం చేశారు. ఆయన జీవితాంతం కాంగ్రెస్‌ వాది’’ అని ఉత్తమ్‌ అన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని