బాబా కా దాబా తరహాలో మరో వీడియో వైరల్
దిల్లీలోని బాబాకా దాబా వీడియో వైరల్గా మారి వృద్ధ దంపతుల కన్నీరు తుడిచిన తరహా ఘటన ఆగ్రాలోనూ చోటుచేసుకుంది. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధుడిని నెటిజన్లు ఆదుకున్నారు...
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని బాబాకా దాబా వీడియో వైరల్గా మారి వృద్ధ దంపతుల కన్నీటిని తుడిచిన తరహా ఘటన ఆగ్రాలోనూ చోటుచేసుకుంది. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధుడిని నెటిజన్లు ఆదుకున్నారు. ఆగ్రాలో కాంజీ బడా పేరుతో చిరుతిళ్ల వ్యాపారం నిర్వహిస్తున్న 90 ఏళ్ల నారాయణ్సింగ్ కొవిడ్ కారణంగా సంపాదన కోల్పోయారు. అయితే స్థానికంగా ఉండే ధన్షిత అనే యువతి దిల్లీలోని బాబా కా దాబా తరహాలోనే ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆగ్రా వాసులు కాంజీ బడా బండిని సందర్శిస్తున్నారు. ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్సింగ్ కూడా కాంజీ బండిని సందర్శించారు. తనకు గిరాకీ పెరగడంతో ఆ బండి నడుపుతున్న నారాయణ్సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, కరోనాతో బతుకుదెరువు కోల్పోయానని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా మళ్లీ తనకు గిరాకీ పెరగడం ఆనందంగా ఉందన్నారు. బాబా కా బాదా వీడియో స్ఫూర్తితో తాను కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ధన్షిత తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?