సింహం.. తీసే కూనిరాగం..
ఓ మృగరాజు కూడా గొంతు సవరించుకుందని అమెరికాలోని బ్రాంక్స్ జూ యాజమాన్యం అంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సంబరాలు చేసుకునేందుకు ప్రపంచమంతా సిద్ధమౌతోంది. ఈ వేడుకల్లో భక్తి గీతాల ఆలాపన కూడా ముఖ్య భాగం. ఈ నేపథ్యంలో నెటిజన్లు భక్తి గీతాలను ఆలపించి, వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుండగా.. ఆ గీతాలు నెట్టింటిని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తానేం తక్కువ తినలేదన్నట్టు ఓ మృగరాజు కూడా గొంతు సవరించుకుందని అమెరికాలోని బ్రాంక్స్ జూ యాజమాన్యం అంటోంది. అనడమే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.
‘‘సింహాలు కూడా పాడతాయని మీకు తెలుసా?ఇప్పుడు మీరు వింటున్న శబ్దం సింహాలు ఒకదానితో ఒకటి సంభాషించుకునే విధానాల్లో ఒకటి. ఇక వాటి గర్జన సుమారు 5 మైళ్ల వరకు వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. చూడబోతే ఇది పండుగ సంబరాలకు తయారౌతున్నట్టుంది!’’ అనే వ్యాఖ్యను ఆ వీడియోకు జతచేసింది. మరి సింహరాజు గానం ఎలా ఉందో వినాలంటే మీరు ఈ వీడియోను చూడాల్సిందే!
ఇవీ చూడండి..
శ్వేతసౌధంలో క్రిస్మస్.. ట్రైలర్ చూస్తారా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.