శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన సందర్శకులు

శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను

Published : 02 Oct 2020 17:25 IST

సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను చూసేందుకు  తరలివస్తున్నారు. గాంధీ జయంతి సెలవు.. శని, ఆదివారాలు కలిసి రావడంతో కార్లు, ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం రహదారులు సందర్శకుల వాహనాలతో రద్దీగా మారాయి. జలదృశ్యాలను చూసేందుకు పలువురు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని