వివేకా హత్యకేసు..విచారణకు తాత్కాలిక బ్రేక్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దర్యాప్తు చేస్తున్న 15
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దర్యాప్తు చేస్తున్న 15 మంది అధికారుల్లో ఇప్పటికే నలుగురికి వైరస్ సోకగా.. తాజాగా మరో ముగ్గురు కొవిడ్ బారిన పడ్డారు. అధికారులకు కరోనా సోకడంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు విచారణకు విరామం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వివేకా హత్య కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెల సుమారు 15 మంది సీబీఐ అధికారులు కడప జిల్లాకు చేరుకున్నారు. కొన్ని రోజుల తరువాత అనుమానితుల విచారణ ప్రారంభించి ప్రక్రియను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా సీబీఐ అధికారులు పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆ బృందంలోని ఏడుగురు అధికారులు కరోనా బారినపడి ప్రస్తుతం కడప నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా అధికారులు దిల్లీ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోగా, త్వరలోనే మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోయింది. కరోనా బారినపడిన ఏడుగురు కోలుకుని కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?