మూడు జిల్లాలుగా విశాఖ!
ఉత్తరాంధ్రలో మహానగరంగా విస్తరిస్తున్న విశాఖను పరిపాలనా సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా విడదీయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఇంటర్నెట్ డెస్క్ : ఉత్తరాంధ్రలో మహానగరంగా విస్తరిస్తున్న విశాఖను పరిపాలనా సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా విడదీయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. దీనికి సహకారం అందించేందుకు జిల్లా స్థాయి కమిటీ తన కసరత్తును పూర్తిచేసింది. అనకాపల్లి, అరకులో భవనాలు, వివిధ కార్యాలయాల కోసం భూములను గుర్తించే పని వేగంగా జరుగుతోంది. భౌగోళికంగా జిల్లాల సరిహద్దుల విభజన పూర్తిచేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, భీమిలి మాత్రమే విశాఖ జిల్లాలో ఉండనున్నాయి. అనకాపల్లి, చోడవరం, నర్నీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని తుని కలిపి అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. దీని వల్ల ప్రస్తుత జిల్లాలోని మైదాన ప్రాంతం రెండుగా విడిపోనుంది. పారిశ్రామిక జిల్లాగా ఉన్న విశాఖలోని ఫార్మాసిటీ, అపెరల్ సిటీ, ఎన్టీపీసీ వంటివి భౌగోళికంగా అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న భవనాలను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. రాష్ట్రస్థాయి కమిటీకి ఇచ్చేందుకు నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను కూడా సేకరించారు.
ప్రస్తుత విశాఖ జిల్లాలో దాదాపు సగభాగం అటవీ ప్రాంతమే ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అరకు జిల్లాగా ప్రతిపాదిస్తున్నారు. అరకు, పాడేరు నియోజక వర్గాలతోపాటు జి.మాడుగుల కూడా దీని పరిధిలోకి తేనున్నారు. ప్రస్తుత జిల్లాలోని 11 గిరిజన మండలాలను అరకు జిల్లా పరిధిలోకి తెస్తారు. ఇప్పటికే పాడేరులో సబ్కలెక్టరు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గిరిజన సహకార కార్పొరేషన్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత