కరోనాపై డబ్ల్యూహెచ్వో ఏమైనా దాస్తోందా?
కరోనా విజృంభణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు ముందే తెలుసా. వైరస్ పుట్టుకకు కారణాలు తెలిసినా బయటకు చెప్పలేదా?నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా?
అనుమానాలకు తావిస్తున్న రికార్డింగ్లు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా విజృంభణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు ముందే తెలుసా? వైరస్ పుట్టుకకు కారణాలు తెలిసినా బయటకు చెప్పలేదా?నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా?సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా? తాజాగా వెలుగులోకి వచ్చిన డబ్ల్యూహెచ్వో అంతర్గత సమావేశానికి సంబంధించిన రికార్డింగ్లు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్లు బయటపడ్డాయి. కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు, అంతర్గత సమావేశాల్లో వైద్యులు, శాస్ర్తవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మధ్య చాలా తేడా ఉన్నట్లు వీటి ద్వారా తెలుస్తోంది. ఈ రికార్డింగ్లు బయటపడటంతో డబ్ల్యూహెచ్వో వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ప్రజల ఆరోగ్య విషయంలో డబ్ల్యూహెచ్వో పాత్ర ఎంతో కీలకం. ఈ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలే ప్రపంచ దేశాలకు దిక్సూచి. మహమ్మారి నేపథ్యంలో ఈ సంస్థ వ్యవహారశైలి ఎన్నో విమర్శలకు తావిచ్చింది. నిధులిచ్చే సభ్యదేశాలపై సంస్థ కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. కరోనా 2.0 పంజా విసురుతున్న క్రమంలో సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్లు, పత్రాలు ఓ వార్తా సంస్థకు చిక్కాయి. విమర్శలను బలపరిచేలా ఉన్న ఆధారాలు లభ్యం కాకపోవడంతో డబ్ల్యూహెచ్వోపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే వెల్లడించింది.
వైరస్పై అధ్యయనం చేయడం ఆ ప్రయోగశాల దురదృష్టం అంటూ డబ్ల్యూహెచ్వోకు చెందిన వైద్యులు, నిపుణులు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు రికార్డింగ్లు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పెద్దస్థాయిలో చర్చకు తెరలేసింది. కరోనా జన్మస్థానమైన చైనాలోని వూహాన్ ల్యాబ్ గురించి వారు మాట్లాడినట్లు భావిస్తున్నారు. వైరస్ ప్రభావిత దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ ఉన్నాయి. డబ్ల్యూహెచ్వోకు వీటి నుంచి భారీగా నిధులు అందుతాయి. మహమ్మారి విషయంలో ఆ దేశాలు ఎన్ని తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు కష్టనష్టాలు ఎదుర్కొన్నాయి.
సభ్య దేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సంస్థ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు రికార్డింగ్లు, పత్రాల ద్వారా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొద్దినెలల క్రితం నిధులను ఆపేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడి గురైంది. తాము ఎన్నికల్లో గెలిస్తే డబ్ల్యూహెచ్వోకు అందాల్సిన నిధులను విడుదల చేస్తామని, కోతలను ఎత్తివేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కాబోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లీ అమెరికా వైపు ఆశగా చూస్తోంది. అయితే రికార్డింగ్ల వ్యవహారం డబ్ల్యూహెచ్వోకు తలనొప్పిలా మారింది. ఇలాంటి తరుణంలో బైడెన్ తన మాటను నిలబెట్టుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్