కన్నులపండువగా భద్రకాళి తెప్పోత్సవం

దేవీశరన్నరాత్రి మహోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారికి విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, నిజరూప దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు..

Updated : 26 Oct 2020 08:15 IST

వరంగల్‌(కార్పొరేషన్‌): దేవీశరన్నవ రాత్రి మహోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారికి విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, నిజరూప దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. సాయంత్రం భద్రకాళి చెరువులో అర్చకులు అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులను తెప్పోత్సవానికి అనుమతించలేదు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. 

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని