నాగార్జునసాగర్‌ 18 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 3,95,117 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..

Published : 23 Aug 2020 02:52 IST

నాగార్జునసాగర్‌: శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరోవైపు కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోరారు. చేపలు పట్టేందుకు, పశువులు మేపేందుకు నదీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అన్నారు. ముంపు ప్రాంతాల వారికి సహాయం కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమయంలో 08632324014, గుంటూరు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం 08632240679, తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం 08644223800, గురజాల రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం 7702853860, 8106142574 నెంబర్లకు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని