సాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని..

Updated : 21 Aug 2020 12:39 IST

నాగార్జునసాగర్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్‌ అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు. నాలుగు గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు నీరు విడుదల చేస్తున్నారు.  

సాగర్‌కు 3.45లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. దీంతో 29,712 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 583.20 అడుగులకు చేరింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను 289.3600 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని