‘లూడో’లో మోసం చేశాడని కోర్టుకెక్కిన యువతి
లూడో ఆటలో తండ్రి మోసం చేశాడంటూ ఓ యువతి
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ ఆటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇద్దరి నుంచి నలుగురు ఆడుకునే ‘లూడో’ ఆట కూడా విపరీతంగా పాపులర్ అయ్యింది. అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతి లూడో ఆటలో తండ్రి మోసం చేశాడంటూ కోర్టు మెట్లెక్కింది. గెలిపిస్తాడని నమ్మానని, కానీ తన పావుల్నే చంపేశాడని.. తండ్రితో తన సంబంధాన్ని తెంచేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తోబుట్టువులు, తండ్రితో ఆడిన ఆటలో తండ్రి తనను గెలిపిస్తాడని భావించానని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ కోర్టుకు తెలిపింది. తనలో సంతోషాన్ని నింపేందుకు ఆయన ఓడిపోయి నన్ను గెలిపిస్తాడని నమ్మకం పెట్టుకున్నానని, కానీ అలా చేయలేదని పేర్కొంది. దీంతో తండ్రిపై ఉన్న గౌరవమంతా పోయిందని, ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. సదరు యువతి ఫిర్యాదుపై ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్ సరిత స్పందించారు. ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్