ధోనీ ఆ నగరం నుంచి వచ్చాడు కాబట్టి..
ఆగస్టు 15న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
నెటిజన్కు జొమాటో సమాధానం
దిల్లీ: ఆగస్టు 15న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్కు ధోనీ అందించిన సేవలను గౌరవించుకోవాలని ఆన్లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ జొమాటో ఝార్ఖండ్ రాజధాని రాంచి వాసులకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఇది రాంచి నగర ప్రజలకు చాలా ఆనందాన్నిచ్చే విషయం. కానీ వేరే ప్రాంతానికి చెందిన వారు మాత్రం ఈ ఆఫర్పై కాస్త అసంతృప్తి వెళ్లగక్కారు. ఓ నెటిజన్ ఏకంగా జొమాటోకు తన అభ్యర్థనను వెలిబుచ్చాడు. ‘అతడు రాంచి నుంచి వచ్చినప్పటికీ, ఆ లెజెండ్ను దేశం మొత్తం ప్రేమిస్తోంది. ఎందుకు ఈ ఆఫర్ను దేశం మొత్తానికి అందించలేదు?’ అని ప్రశ్నించాడు. దానికి జొమాటో తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘భారత దేశానికి ఒక లెజెండ్ను బహుమతిగా ఇచ్చిన నగరానికి ఈ బహుమతి!’ అని స్పందించింది. కాకపోతే ఈ సమాధానం అందరిని మెప్పించలేకపోయింది. అది వేరే విషయం. ఇదిలా ఉండగా.. ధోనీ శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా తన రిటర్మెంట్ ప్రకటనను తెలియజేస్తూ..తనను ప్రేమించి, సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!