మేం గోదారోళ్లం.. మర్యాదలో తగ్గేదే లే!
కొత్తగా అమ్మాయికి పెళ్లి చేశాక అత్తారింటికి పంపేటప్పుడు తగిన కానుకలు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ. మర్యాదకు మారుపేరుగా .......
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా అమ్మాయికి పెళ్లి చేశాక అత్తారింటికి పంపేటప్పుడు తగిన కానుకలు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ. మర్యాదకు మారుపేరుగా చెప్పుకొనే గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ సంప్రదాయం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆడపిల్లల తరఫు వారు ఆషాఢంలో వియ్యంకుడి ఇంటికి సారె (ఆషాఢం కావిడి) పంపించడాన్ని ఇక్కడ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పుట్టింటివారి గురించి అత్తింటి బంధువులు గొప్పగా చెప్పుకొనేలా ఉండాలని ఇంట్లో సరకుల దగ్గర నుంచి స్వీట్లు దాకా రకరకాల వస్తువులు పంపిస్తుంటారు. ఎవరి తాహతుకు తగినట్టు వారు ఇచ్చుకుంటారు. అయితే, రాజమహేంద్రవరంలో ఓ తండ్రి ఇటీవల పెళ్లైన తన కుమార్తెకు పంపించిన ఆషాఢం కావిడ చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించనంత భారీ స్థాయిలో కుమార్తెకు కానుకలు పంపడం అందరినీ అబ్బురపరిచింది.
యానాంకు చెందిన ఓ ద్విచక్ర వాహన షోరూం యజమాని తోట రాజు కుమారుడు పవన్కుమార్కు రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త బత్తుల రామకృష్ణ కుమార్తె ప్రత్యూషా దేవికి ఇటీవల వివాహం జరిగింది. వియ్యంకుడి ఇంటికి రామకృష్ణ ఆదివారం పంపిన ఆషాఢం సారె చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఊరు ఊరంతా ఆశ్చర్యపడేలా స్టీలు బిందెల్లో 30 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా సరకులు, 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, టన్ను కూరగాయలు, 200 జాడీల ఆవకాయ పంపించి తన కుమార్తె పట్ల ప్రేమను చాటుకున్నారు. వీటిని పెద్ద ఊరేగింపుగా రాజమహేంద్రవరం నుంచి యానాం వరకు తీసుకెళ్లారు. తోట రాజు ఈ సారెను గ్రామంలో తెలిసిన వారు, బంధువులకు పంచిపెట్టారు. దీంతో ఈ అంశం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు