AP News: నాలుగేళ్ల తర్వాత దొరికిన అమ్మ
నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధురాలి ఆచూకీ దొరకటంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. అమ్మ ఆచూకీ కోసం రాష్ట్రం నలుమూలలా వెతికి వేసారిన....
మాజీ సర్పంచ్ చొరవతో ఇంటికి
పెనుగంచిప్రోలు: నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధురాలి ఆచూకీ దొరకటంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. అమ్మ ఆచూకీ కోసం రాష్ట్రం నలుమూలలా వెతికి వేసారిన ఆ కుమారులకు.. 'మీ అమ్మ మా ఊళ్లోనే ఉంది.. వచ్చి తీసుకెళ్లండి' అని వచ్చిన ఓ ఫోన్ కాల్ వారిని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. వారి ఆనందానికి హద్దే లేకుండాపోయింది.
కడప జిల్లా పలసపాడు మండలం మహానంది పల్లె గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బమ్మ(85) నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కోడలిపై అలిగిన వృద్ధురాలు.. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భద్రాచలానికి చేరుకుంది. అక్కడ రెండేళ్లపాటు ఉంది. తర్వాత కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వెళ్లింది. గత ఏడాదిన్నరగా ఆ గ్రామంలోనే యాచిస్తూ పొట్టనింపుకుంటూ.. స్థానికంగా ఉన్న బస్ షెల్టర్లో తలదాచుకుంటోంది.
వృద్ధురాలిని గత కొంత కాలంగా పరిశీలిస్తున్న మాజీ సర్పంచి జిల్లాపల్లి సుధీర్ బాబు ఆమె గురించి ఆరా తీశాడు. పలుమార్లు సుబ్బమ్మతో మాట్లాడి చిరునామా తెలుసుకున్నారు. కొవిడ్ రెండో దశకు ముందు ఆమెను స్వగ్రామానికి తిరిగి పంపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో వృద్ధరాలి ఫోటో తీసుకొని కడప జిల్లాలోని తన మిత్రులకు పంపించి విచారణ చేపట్టారు. వారి ద్వారా మహానందిపల్లెలోని సుబ్బమ్మ మనవడు పెద్దిరెడ్డి నారాయణరెడ్డికి వాట్సప్ ద్వారా ఫోటో పంపి ఆమె పెనుగంచిప్రోలులో ఉన్న విషయాన్ని తెలిపారు.
వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు తిరిగి సర్పంచి సుధీర్ బాబుకు ఫోన్ చేసి.. సుబ్బమ్మ వారి గ్రామంలోనే ఉందని నిర్ధారించుకున్నారు. సుబ్బమ్మ కొడుకు పెద్దిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మనవడు నారాయణరెడ్డి ఇద్దరు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. వారిని గుర్తుపట్టిన వృద్ధురాలు ఒక్కసారిగా బోరున విలపించింది. నాలుగేళ్లుగా దూరమైన అమ్మను తమకు దగ్గర చేసిన సుధీర్ బాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
సుబ్బమ్మ కొడుకు వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఏడాది తర్వాత తండ్రి చలమారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడని అప్పటి నుంచి అమ్మ కోసం రాష్ట్రమంతా విస్తృతంగా గాలింపు చేశామన్నారు. అమ్మ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఇంతలో ఆమె తమ వద్దకు చేరడం ఎంతో ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె దాచుకున్న రూ. 85 వేల డబ్బును స్థానికులు సుబ్బమ్మకు తిరిగి ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.