Andhra News: మంత్రి విడదల రజనీ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం

Published : 03 Sep 2022 01:19 IST

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఉన్న మంత్రి కార్యాలయం వద్దకు శుక్రవారం సాయంత్రం గీత కార్మికుడు పోతునూరి వెంకటేశ్వర్లు వచ్చాడు. పురుగుల మందు డబ్బాతో కార్యాలయం వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు తనకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే అతన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడని, మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని