Maharashtra: 25ఏళ్ల యువకుడు 1,850కిలోమీటర్లు నడిచాడు.. ఎందుకో తెలుసా..!
‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద సూక్తికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువకుడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు కట్టుకొని కూర్చోకుండా తనవంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అన్న స్వామి వివేకానంద సూక్తికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువకుడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చేతులు కట్టుకొని కూర్చోకుండా తనవంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు. దీని కోసం ఏకంగా 1,850 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రైతుల ఆత్మహత్యలు, నీటి కొరత సమస్యలు, ప్లాస్టిక్ వినియోగం పై చలించిన అతను ప్రజల్లో అవగాహన తీసుకురావాలని గ్రామ గ్రామానికి వెళ్లి గ్లోబల్ వార్మింగ్పై అక్కడ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలో రత్నగిరిలోని నర్వాన్ గ్రామానికి చెందిన అశుతోష్ జోషి తన పాఠశాల విద్యను చిప్లూన్ తహసీల్లో పూర్తి చేశాడు. తర్వాత ముంబయిలోని మోడల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో, పుణెలోని భారతి విద్యాపీఠ్లో చదువు కొనసాగించారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఫైన్ ఆర్ట్స్లో విద్యను పూర్తి చేశాడు. చదువు ముగిశాక ఫొటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్న ఆయన స్కాట్లాండ్, స్పెయిన్, ఇంగ్లాండ్లలో పని చేశాడు.
భారత్కు వచ్చాకా ఇక్కడ పరిస్థితులను చూసి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 10న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మహారాష్ట్ర నర్వాన్ బీచ్ నుంచి మెదలు పెట్టి ఒడిశాలోని పురి వరకు 1,850 కిలోమీటర్లు నడిచాడు. అన్ని గ్రామాల్లోని సర్పంచులను కలిసి అక్కడ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. తన ప్రయాణంపై జోషి మాట్లాడుతూ.. ‘దీని కోసం 6-7 సంవత్సరాల నుంచి నడకను ప్రాక్టీస్ చేశాను. ఆరు నెలలుగా ఈ పర్యటన కోసం నన్ను నేను సిద్ధం చేసుకున్నాను’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల