పని ఒత్తిడి.. వైద్యుడి చెంప చెళ్లుమనిపించిన నర్సు

ఉత్తరప్రదేశ్‌లో ఓ వైద్యుడు, నర్సు ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాంపూర్‌ జిల్లా ఆసుపత్రికి పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారని.. పనిభారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరు వాగ్వాదానికి దిగినట్లు....

Updated : 27 Apr 2021 15:59 IST

రాంపూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వైద్యుడు, నర్సు ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాంపూర్‌ జిల్లా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని.. పనిభారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్టర్‌తో ఘర్షణకు దిగిన నర్సు.. అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వైద్యుడు కూడా నర్సుపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఇద్దరితో మాట్లాడతామని, సమస్యకు కారణాలను పరిశీలిస్తామని సిటీ రాంపూర్‌ మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు