మాస్కుపై అవగాహనకు గాంధీజీ అవతారం
కరోనా విలయతాండవం చేస్తున్నా కొందరు కళ్లు తెరవడం లేదు. మాస్కు ధరించాలని విన్నవించుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. అలాంటివారిని గాడిన పెట్టేందుకు గాంధీజీ అవతారమెత్తారు ఓ విశ్రాంత ఉద్యోగి. మహాత్ముడి వేషధారణలో మాస్కుల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు....
గుత్తి: కరోనా విలయతాండవం చేస్తున్నా కొందరు కళ్లు తెరవడం లేదు. మాస్కు ధరించాలని విన్నవించుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. అలాంటివారిని గాడిన పెట్టేందుకు గాంధీజీ అవతారమెత్తారు ఓ విశ్రాంత ఉద్యోగి. మహాత్ముడి వేషధారణలో మాస్కుల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు చెందిన తిరుపతయ్య బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఉద్యోగ జీవితాన్ని వదిలేసిన తిరుపతయ్యకు కరోనా వైరస్ సామాజిక కర్తవ్యాన్ని బోధించింది. కొవిడ్పై ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని తగ్గించాలని ఆయన మహాత్ముడి వేషం కట్టారు. వైరస్పై అవగాహన కల్పిస్తూ ప్రతిఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.
గుత్తి పట్టణంలోని ప్రధాన రహదారులు, గాంధీ కూడలి వద్ద రద్దీ ప్రాంతాల్లో తిరుపతయ్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి బస్సుల్లోని ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. మహమ్మారికి ఎవరూ బలవ్వకూడదనేదే తన ప్రయత్నమంటున్నారు తిరుపతయ్య.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM