Andhra News: ‘పెగాసస్’ విషయంలో నాపై ఆరోపణలు అవాస్తవం: ఏబీ వెంకటేశ్వరరావు
పెగాసస్పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు తెలిపారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని..
విజయవాడ: ‘పెగాసస్’పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు తెలిపారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. నిజాయతీగల ఓ వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘పెగాసెస్’ అంశంపై గత కొద్ది రోజులుగా మీడియాలో చర్చ సాగుతోంది. నా పై వ్యక్తిగత ఆరోపణలు, కథనాలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆందోళన, అభద్రతా భావం చెందుతున్నారు. అందుకే మీడియా ముందుకొచ్చా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను నిఘా విభాగాధిపతిగా పనిచేసిన కాలంలో ఏం జరిగిందనే విషయాలను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. 2019 మే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం, డీజీపీ, సీఐడీ, ఏసీబీ.. ఇలా ఏ ప్రభుత్వ విభాగం కూడా ‘పెగాసస్’ను కొనలేదు.. వాడలేదు. ఏ ఇతర ప్రైవేటు సంస్థలు సైతం పెగాసస్ను వాడలేదు. ఎక్కడా ఫోన్లు ట్యాప్ కాలేదు. 2019 మే తర్వాత ఏం జరిగిందనే దానికి నా దగ్గర సమాచారం లేదు. 2021 ఆగస్టు వరకు ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనలేదని డీజీపీ కార్యాలయం ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా కొనని, వాడని దాన్ని తీసుకొచ్చి నాతో ముడిపెట్టడం సరికాదు. నాపై వచ్చిన ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సి రావడం నా దౌర్భాగ్యం. పెగాసస్తో ముడిపెట్టి నాపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నాపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు కరెక్టు? నాపై చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని తెలిసి నేను నిశ్చింతగా ఉన్నాను. నాపై రాసిన అసత్య వార్తలు చదివి బంధువులు, మిత్రులు ఏమనుకుంటారు? 30 ఏళ్ల పాటు వృత్తి ధర్మం పాటించాను. నా సర్వీసు మొత్తం వ్యక్తిత్వం కాపాడుకునేందుకు ప్రయత్నించాను. అలాంటి నేను దేశద్రోహిని ఎలా అవుతాను? నా వ్యక్తిత్వాన్ని కావాలని దెబ్బతీయడం అనైతికం. ఉద్యోగికి ఆత్మ గౌరవం ఉంటుంది. ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తే రేపు అఖిలభారత ఉద్యోగులు ఎలా పనిచేస్తారు? నన్ను సస్పెండ్ చేస్తే.. కోర్టులో ఛాజెంజ్ చేశా. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు నేను వ్యతిరేకించడం లేదు. నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంతకాలం ‘పెగాసస్’ అనే సాఫ్ట్వేర్ను కొనలేదు.. వాడలేదు అని మరోసారి ప్రజలకు చెబుతున్నాను’’ అని ఏబీ వెంకటేశ్వర్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద