Diabetic: మధుమేహంతో గుండెకు ముప్పు
మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు మధుమేహ వ్యాధి పెను విపత్తును తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం అడుగడుగునా
ఇంటర్నెట్ డెస్క్: మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు మధుమేహ వ్యాధి పెను విపత్తును తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం అడుగడుగునా గుండెకు అవాంతరాలు కలిగిస్తోంది. మధుమేహం వల్ల రక్తనాళాల్లో ఆటంకాలు, ఛాతిలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు సంభవించే అవకాశం ఉంది. ప్రాణాంతకమైన ఈ విపత్తు వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే కారణమని చెబుతున్నారు వైద్యులు. ఈ సందర్భంగా వయసు పెరిగే కొద్దీ మధుమేహం గుండెకు ముప్పుగా ఎలా పరిణమిస్తుంది? షుగర్ దాడి నుంచి గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పలు అంశాల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.రమేష్ గూడపాటి మాటల్లో..
డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి?
మధుమేహం వల్ల గుండెలో తలెత్తే సమస్యను డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దీని వల్ల గుండెలోని కండరాలు గట్టి పడటం లేదా బలహీనపడటం జరుగుతుంది. దీన్ని డయాబెటిక్ కాడియోమయోపతి అంటారు. ఎప్పుడైతే గుండెలోని కండరాలు పనిచేయడం మానేస్తాయో.. అప్పుడు గుండెలో ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. అలాగే కొందరిలో గుండెకు రక్తం చేరవేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దానివల్ల సాధారణ వ్యక్తుల్లో కంటే వీళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం రెట్లు అధికంగా ఉంటుంది.
మధుమేహం మూలంగా గుండెకు ఎలాంటి సమస్యలు వస్తాయి?
మధుమేహంతో బాధపడేవాళ్లలో కొంతమందికి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో అయితే గుండె పోటు వచ్చిందన్న విషయం వైద్య పరీక్షల్లో కూడా తెలియదు. కాబట్టి మధుమేహం ఉన్న వాళ్లు శరీరంలో కొత్తగా ఏవైనా సమస్యలు గుర్తించినట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మధుమేహంతోపాటు గుండెకు సమస్యల్ని పెంచే ఇతర రిస్కు ఫ్యాక్టర్స్ ఏంటి?
మధుమేహం వల్ల ప్రధానంగా రక్తపోటు, అధిక బరువు సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో మంచి కొవ్వు తగ్గి, చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. మధుమేహం వల్ల ఏర్పడే సమస్యలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలను, మధుమేహం వల్ల వచ్చిన ఇతర సమస్యలను ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే గుండె సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
డయాబెటిక్ హార్ట్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది?
మధుమేహం ఉన్న వాళ్లకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్, ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షల వల్ల రక్తనాళాల్లోని పూడికలను గుర్తించడానికి వీలవుతుంది. వాటిని సరిచేసుకుని, మందులు వాడటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
మధుమేహం బారి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలి?
దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహం ఉన్న వాళ్లలో యుక్త వయసులో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లు చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. మధుమేహంతో పాటు, బీపీ, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు వీలైనంత తగ్గించుకొనే ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పాల సంబంధిత పదార్థాలు, తీపి పదార్థాలు తీసుకోవడం వీలైనంత తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండెకు సంబంధించిన సమస్యలను చాలావరకూ రాకుండా చూసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!