Text Neck: వాళ్లలో మెడనొప్పికి కారణం ఇదే!
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ ఇప్పుడు సెల్ఫోన్ హస్తభూషణంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ ఇప్పుడు సెల్ఫోన్ హస్తభూషణంగా మారింది. నేడు అందరి దగ్గరా సెల్ఫోన్లు కనిపిస్తున్నాయి. సెల్ఫోన్ చేతిలో లేనిదే ఎవరికీ ఏమీ తోచడం లేదు. పక్కవాళ్ల ఫోన్ మోగినా తమ ఫోన్ మోగుతుందేమోనని చూసుకునే వాళ్లే అందరూ. ఏ పని చేస్తున్నా పదినిమిషాలకు ఒకసారైనా ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తుంటారు. చాలామంది సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి చాటింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. దీనివల్ల కొత్తరకమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారంతా ఇంటా బయటా అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫోన్ వాడుతున్నట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. ఈ వయసువాళ్లు మెలకువగా ఉన్న సమయంలో కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్కు దూరంగా ఉంటున్నారని పరిశోధనల్లో తేలింది. సెల్ఫోన్ను అస్తమానం చూసే క్రమంలో నిరంతరాయంగా తల వంచి టైప్ చేస్తూ ఉండటంవల్ల మెడలో సమస్యలు వస్తున్నాయి. దీన్నే వైద్యులు టెక్ట్స్ నెక్ సిండ్రోమ్గా వ్యవహరిస్తున్నారు. అదే పనిగా మెడను వంచి చేతివేళ్లతో టైప్ చేయడంవల్ల భుజం లాగడం, వేళ్లు తిమ్మిర్లు ఎక్కడం, వెన్నెముక పైభాగంలో నొప్పి కలుగుతుందని, సమస్య తీవ్రమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందనీ వైద్యులు అంటున్నారు.
టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే సెల్ఫోన్ను సాధ్యమైనంత దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైన సందర్భాల్లో ఫోన్ ఎక్కువసేపు వినియోగించాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. అలాగే కంప్యూటర్, టాబ్లెట్, ఫోన్ వాడేటపుడు మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తలను కిందకు వంచకుండా వీలైనంత వరకూ ఫోన్ని కంటికి ఎదురుగా పెట్టుకొని మాత్రమే టైప్ చేయాలి. ముఖ్యంగా గంటల తరబడి చాటింగ్ చేయడం మానుకోవాలి. అలాగే అవసరమైనప్పుడే ఫోన్ ఉపయోగించడం వల్ల శారీరక, సాంఘిక సమస్యలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు