AICTE: ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సుల విద్యా సంవత్సరం ఖరారు

ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సుల విద్యా సంవత్సరాన్ని ఏఐసీటీఈ ఖరారు చేసింది.

Published : 26 Mar 2022 09:51 IST

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సుల విద్యా సంవత్సరాన్ని ఏఐసీటీఈ ఖరారు చేసింది. ఈ క్రమంలో జులై 30 నాటికి కళాశాలలకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయనుంది. ఆగస్టు 31లోపు వర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సెప్టెంబర్‌ 15 నాటికి ప్రస్తుత విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అక్టోబర్‌ 25 నాటికి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని