Amaravati: లింగమనేని రమేశ్‌ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు

తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుపై ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇవ్వనుంది.

Updated : 02 Jun 2023 13:51 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుపై ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తుపై సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.  ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈనెల 6న నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌ నివాసాన్ని అటాచ్‌ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును ఈనెల 6కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని