TS: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన..
హైదరాబాద్: తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. 6వ తరగతికి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదర్శ పాఠశాలల డైరెక్టర్ తెలిపారు. జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్ 14న ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 18 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. జూన్ 21న తరగతలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఇతరులు రూ. 150 ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ను పరిశీలించాలని డైరెక్టర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?