Pragya Thakur: గార్భ డ్యాన్స్ చేసి ఆ తర్వాత కబడ్డీ ఆడిన భాజపా ఎంపీ..

భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి క్రీడాకారిణిగా మారారు. గతంలోనూ ఆమె బాస్కెట్‌బాల్‌ ఆడి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.

Published : 15 Oct 2021 01:25 IST

దిల్లీ: భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి క్రీడాకారిణిగా మారారు. గతంలోనూ ఆమె బాస్కెట్‌బాల్‌ ఆడి  అందర్ని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా తన నివాసంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మహిళలతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. తాజాగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె కబడ్డీ ఆడి, గార్భ డ్యాన్స్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ తన సొంత నియోజకవర్గమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న కాళీ మాతా ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆ సమయంలో అక్కడ మైదానంలో కబడ్డీ ఆడుతున్న చిన్నారులు ఆమెను కబడ్డీ ఆడాలని కోరారు. దీంతో ఆమె కూతకు వచ్చి గీతను తొక్కి వెనుదిరిగారు. దీనికంటే ముందు గార్భ డ్యాన్స్‌ చేస్తున్న వారితోనూ కలిసి ఎంపీ కాలు కదిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని