Samatha Murthy: ఒక్కరోజులోనే ఆ క్షేత్రాలను చూసే అదృష్టం: అహోబిలం చిన్నజీయర్ స్వామి
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో వచ్చే నెల 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో వచ్చే నెల 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వివరాలను అహోబిలం చిన్నజీయర్ స్వామి మీడియాకు వివరించారు. శ్రీరామానుజ చరిత్రపై థియేటర్లో భక్తులకు ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే భక్తులను అక్కడికి అనుతిస్తామన్నారు. సమతామూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్య క్షేత్రాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కరోజులోనే వీటన్నింటినీ చూసే అదృష్టం కలుగుతుందని చెప్పారు. 108 దివ్యక్షేత్రాల్లో తిరుపతి, అహోబిలం, పాలసముద్రం, వైకుంఠం తదితర ప్రతిరూపాలు ఉంటాయని అహోబిలం చిన్నజీయర్ స్వామి వివరించారు.
‘‘బద్రీ నారాయణ క్షేత్రం కూడా ఇక్కడ ఉంది. తెలుగునాట రెండు దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరుపతి, రెండు అహోబిలం. సమతామూర్తి విగ్రహం దిగువ భాగంలో 108 మెట్లు, 54 ఏనుగులు, 108 పద్మాలు ఉంటాయి. ఒక్కో పద్మదళం 27 అడుగుల పొడవు ఉంటుంది. స్వామివారి చేతిలో ఉన్న త్రిదండం ఆరు వేల కిలోల బరువు ఉంటుంది. సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆశ్రమంలోనే తయారు చేయించాం. మొదటి అంతస్తులో 48 స్తంభాలున్నాయి. వాటిపై రామానుజాచార్యుల జీవిత చరిత్ర తెలిపే చిత్ర పటాలు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులోని విశ్రాంతి గదిలో అన్ని రాష్ట్రాల చిహ్నాలు ఏర్పాటు చేశాం. సమతామూర్తి కేంద్రం ఆధ్యాత్మికతనే కాదు జ్ఞానాన్నీ అందిస్తుంది’’ అని అహోబిలం చిన్నజీయర్ స్వామి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!