Cloud gaming: ఎయిర్టెల్ 5జీ క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతం
భారత్లో మొదటిసారిగా 5జీ నెట్వర్క్ ఆధారిత క్లౌడ్ గేమింగ్ సెషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ గురువారం ప్రకటించింది. 5జీ ట్రయల్స్లో భాగంగా ప్రభుత్వ టెలికాం విభాగం కేటాయించిన స్పెక్ట్రంలో...
దిల్లీ: భారత్లో మొదటిసారిగా 5జీ నెట్వర్క్ ఆధారిత క్లౌడ్ గేమింగ్ సెషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ గురువారం ప్రకటించింది. 5జీ ట్రయల్స్లో భాగంగా ప్రభుత్వ టెలికాం విభాగం కేటాయించిన స్పెక్ట్రంలో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొంది. గురుగ్రాంలోని మానెసర్లో ఈ సెషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్దీప్ సెఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మొబైల్ గేమింగ్కు ఆదరణ పెరుగుతోందని, అద్భుతమైన డిజిటల్ భవిష్యత్తుకు ఇది నాంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోని ఆయా నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎరిక్సన్, నోకియాతో జట్టుకట్టింది.
ఏమిటీ క్లౌడ్ గేమింగ్?
డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా, ఆన్లైన్లోనే రియల్ టైమ్లో గేమ్స్ ఆడుకునేందుకు వీలు కల్పించే సాంకేతికతే క్లౌడ్ గేమింగ్. భారత్లో యువజనాభా, పెరుగుతున్న స్మార్ట్ ఫోన్లు, 5జీ సాంకేతికత ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మొబైల్ గేమింగ్ రంగం 2.4 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కెట్గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం 436 మిలియన్లుగా ఉన్న ఆన్లైన్ గేమర్స్ సంఖ్య.. 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ ఇటీవల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి