#AirtelDown: ఎయిర్టెల్ సేవలకు అంతరాయం.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదు
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ (Airtel) సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి పలువురు ఎయిర్టెల్ యూజర్లు సోషల్మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ (Airtel) సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య దాదాపు గంట పాటు ఆ కంపెనీ సేవలు నిలిచిపోయాయి. దీనిపై పలువురు ఎయిర్టెల్ యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎయిర్టెల్ నెట్వర్క్ సిగ్నల్ రావడం లేదని, ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ #AirtelDown హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు చేశారు. దాదాపు గంట తర్వాత సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
డౌన్ ట్రాకర్ వెబ్సైట్ ప్రకారం.. సాయంత్రం 4 నుంచి ఈ సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్ టెలికాం సేవలతో పాటు ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్, ఎయిర్టెల్ డీటీహెచ్ సేవల్లో సైతం ఈ లోపం తలెత్తినట్లు సమాచారం. కొందరికి మొబైల్లో సిగ్నల్ వస్తున్నప్పటికీ మెసేజులు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, తమిళనాడు, దిల్లీకి చెందిన యూజర్లు కూడా దీనిపై ఫిర్యాదులు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత క్రమంగా ఫిర్యాదుల సంఖ్య తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి