Amaravati: అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న అమరావతి రైతులు

అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Updated : 02 Apr 2023 13:26 IST

శ్రీకాకుళం: అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. 

ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రథాన్ని శ్రీకాకుళం తీసుకొచ్చిన రైతులు.. శనివారం ఆదిత్యుని ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని