Ap News: వెలగపూడిలో రాజధాని రైతుల కాగడాల ప్రదర్శన

అమరావతి-సంక్రాంతి నిరసనలో భాగంగా ఆదివారం రాత్రి వెలగపూడిలో రాజధాని రైతులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

Published : 16 Jan 2022 22:39 IST

వెలగపూడి: అమరావతి-సంక్రాంతి నిరసనలో భాగంగా ఆదివారం రాత్రి వెలగపూడిలో రాజధాని రైతులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వెలగపూడి దీక్షా శిబిరం నుంచి జేఏసీ కార్యాలయం వరకు ‘అమరావతి వెలుగు’ పేరుతో మహిళలు, రైతులు రహదారి వెంట కాగడాలు, కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ నినాదాలు చేశారు. తెదేపా నేతలు టి.శ్రావణ్‌ కుమార్‌, గద్దె అనురాధ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ తదితరులు ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని