దిల్లీలో అమరావతి ఐకాస మౌన ప్రదర్శన
గాంధీజీ 151వ జయంతి సందర్భంగా అమరావతి ఐకాస నేతలు దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి...
దిల్లీ: గాంధీజీ 151వ జయంతి సందర్భంగా అమరావతి ఐకాస నేతలు దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించి మౌన ప్రదర్శన నిర్వహించారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఐకాస నాయకులతో పాటు తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ మహాత్ముడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐకాస కన్వీనర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం 290 రోజులుగా గాంధేయ మార్గంలోనే నిరసన కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని మహాత్ముడిని వేడుకున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం