Andhra News: అమరావతి తీర్పుపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో తీర్పుపై సీఎస్‌ సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్‌

Updated : 02 Apr 2022 12:46 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి విషయంలో తీర్పుపై సీఎస్‌ సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 190 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. గత నెల 3న అమరావతి రాజధాని కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై నెల రోజుల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ నెల 3వ తేదీలోగా సీఆర్డీఏ.. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని