Stick Idly: పుల్ల ఇడ్లీ.. ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ వైరల్‌

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా తాజాగా ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఓ అల్పాహారానికి సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. అదే ‘పుల్ల ఇడ్లీ’. సాధారణంగా పుల్ల ఐస్‌క్రీం గురించి అందరికీ తెలుసు...

Published : 01 Oct 2021 11:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా తాజాగా ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఓ అల్పాహారానికి సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. అదే ‘పుల్ల ఇడ్లీ’. సాధారణంగా పుల్ల ఐస్‌క్రీం గురించి అందరికీ తెలుసు! కానీ.. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మాత్రం పుల్ల ఇడ్లీ చేస్తున్నారు. పుల్ల సాయంతో ఇడ్లీని చట్నీ, సాంబార్‌లో ముంచుకుని తినేలా తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేస్తూ.. ‘బెంగళూరు.. దేశ వినూత్న ఆవిష్కరణలకూ రాజధాని అయిన ఈ నగరం, తన సృజనాత్మకతను ప్రదర్శించకుండా ఉండలేకపోతోంది’ అనే వ్యాఖ్యను జతచేశారు.

దీనిపై నెటిజన్లనుంచి భిన్న స్పందన వస్తోంది. ఇలా ఎలా తింటారని కొందరు కామెంట్‌ చేయగా, చెయ్యి కడుక్కోవాల్సిన అవసరం లేదు, నీటి వృథా కూడ తప్పుతుంది అని కొందరు.. ఇలా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇతరత్రా వినూత్న ఆహార ఫొటోలను కామెంట్లలో పెడుతున్నారు. ఆనంద్‌ మహీంద్రా.. సోషల్‌ మీడియాలో నిత్యం ఆసక్తికర వీడియోలు, ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇందులో కొన్ని అలరించేవి, మరికొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని