Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారు మెట్ల మార్గం మూసుకుపోయినా, పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునేలా సరికొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంటే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.
ముంబయి: ఎత్తైన భవన సముదాయాలు, అపార్ట్మెంట్ల వద్ద అగ్నిప్రమాదాలు (Fire Accident) సంభవించినప్పుడు సులువుగా బయటపడేందుకు మార్గం లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం నుంచి భయటపడేందుకు కొంత మంది పైఅంతస్తుల నుంచి కిందికి దూకేస్తుంటారు. దీంతో గాయాలపాలవ్వడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటి విషాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారు మెట్ల మార్గం మూసుకుపోయినా, పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునేలా సరికొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంటే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ఇదే ఆలోచనతో రూపొందించిన డివైజ్పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు.
‘‘ఇది నిజమని నేను ఆశిస్తున్నాను. ఒక కంపెనీ ఈ డివైజ్ను తయారుచేస్తోంది. నేను ఎత్తైన భవనాల్లో నివస్తుంటే మొదట నేను దీన్ని కొంటాను. వినూత్నమైన ఆలోచన’’ అని ట్వీట్ చేశారు. వీడియోలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి ఒక బ్యాగ్ను ధరించి కిటికీలోంచి దూకుతాడు. అతను కిందకి దూకే సమయంలో బ్యాగ్లోంచి పారాచ్యూట్ కమలం ఆకారంలో విచ్చుకుంటుంది. దాంతో కిందకు దూకినపుడు పూర్తి రక్షణగా ఉంటుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికిపైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘గొప్ప ఆలోచన’, ‘భద్రత ఎంతో ముఖ్యం.. తప్పక కొనుగోలు చేయాల్సిన డివైజ్’అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య