Andhra News: కేరళలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. ఆరా తీసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిబల యాత్ర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎంఓ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేరళ: ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిమల యాత్ర బస్సు కేరళలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తులు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా కేరళలోని పతనంథిట్ట సమీపంలోని మలుపు వద్ద స్కిడ్ అయి బోల్తా పడిందని అధికారులు సీఎంకు వివరించారు. 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమల వెళ్లారని.. తిరిగి వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం 8గంటలకు ఒక బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో 40మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురికి పథనాంతిట్ట వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని.. పతనంథిట్ట అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఇబ్బంది లేకుండా వైద్యంతోపాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా